Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీదేవి తనయ జాన్వీకపూర్
జాన్వీ కపూర్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'మిలి'. మాతుకుట్టి గ్జేవియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. ఈనెల 4న సినిమా రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా బుధవారం మీడియాతో జాన్వీ కపూర్ మాట్లాడుతూ, 'డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు ఈ చిత్రంతో నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఉందనిపించింది. రోల్ ఛాలెంజింగ్గా అనిపించింది. మా నాన్నతో నేను చేసిన తొలి సినిమా. -18 డిగ్రీల టెంపరేచర్లో 22 రోజుల పాటు చిత్రీకరించాం. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేయటం చాలా కష్టం. నటిగా 15-16 గంటల పాటు ఫ్రీజర్లో ఉండటం అంటే చిన్న విషయం కాదు.. చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయి. దక్షిణాది ప్రేక్షకులు మా అమ్మకి, నాన్నకి ఎంత ప్రేమను అందించారో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. నేను కూడా చాలా రోజులుగా సౌత్లో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను. త్వరలోనే చేసే అవకాశం ఉంది' అన్నారు. 'నా సతీమణి శ్రీదేవికి తెలుగు సినిమా ఎలాంటి ఆదరణ చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నా కుమార్తె జాన్వీకి కూడా అదే తరహా ప్రేమాభిమానాలు దక్కుతాయని ఆశిస్తున్నాను' అని బోనీ కపూర్ చెప్పారు.