Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న మరో చిత్రం 'బుట్ట బొమ్మ'. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట నాయిక, నాయకులుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగవంశీ ఎస్., సాయి సౌజన్య నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
సోమవారం దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ను చిత్ర బందం విడుదల చేసింది.
'విడుదలైన టీజర్ ఆద్యంతం ప్రతిక్షణం ఆకట్టుకుంటూ, ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రధాన పాత్రల తీరు తెన్నులు, అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్టల అభినయం అందర్నీ ఆకట్టుకుంటోంది. ''మళ్లీ ఎప్పుడు కాల్ చేస్తావ్... ఇంకోసారి చెయ్యాలంటే ... ఇప్పుడు కాల్ కట్ చెయ్యాలిగా''...''మాటింటే మనిషిని చూడాలని పించాలి.. మాట్లాడుతుంటే పాట ఇంటున్నట్టుం డాలి''...వంటి పాత్రోచితంగా సాగే సంభాషణలు చిత్రంపై మరింత ఆసక్తిని కలిగిస్తాయి. అరవై ఐదు క్షణాల పాటు సాగే ఈ వీడియోలో వంశీ పచ్చి పులుసు ఛాయాగ్రహణం, గోపిసుందర్ సంగీతం చిత్రాన్ని మరో మెట్టెక్కిస్తాయి అని నమ్మకంగా చెప్పొచ్చు' అని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ, ''బుట్ట బొమ్మ'గా అనిక సురేంద్రన్, అలాగే అర్జున్ దాస్, సూర్య వశిష్టల పాత్రలు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథలో సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. గుర్తుండి పోతాయి. ప్రేమలోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి' అని తెలిపారు.
'విడుదలైన టీజర్ని చూస్తే మా దర్శకుడి మాటలు నిజమనిపిస్తాయి. సంభాషణల రచయితగా 'వరుడు కావలెను' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గణేష్ కుమార్ రావూరి ఈ చిత్రానికి కూడా మాటలు అందిస్తున్నారు. సంభాషణల్లో తనదైన బాణీ పలికించటానికి ఆయన తపన స్పష్టమవుతుంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. సినిమా విడుదల, ఇతర వివరాలు, మరిన్ని విశేషాలు ఒక్కొక్కటిగా తెలియపరుస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా ఇది' అని నిర్మాతలు చెప్పారు.