Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సగుని', 'కాష్మోరా', 'తీరన్ అధిగారమ్ ఒండ్రు', 'ఖైదీ', 'సుల్తాన్' వంటి 5 సూపర్హిట్ చిత్రాల తర్వాత హీరో కార్తి 6వ సారి ప్రతిష్టాత్మక చిత్రం 'జపాన్' కోసం డ్రీమ్వారియర్ పిక్చర్స్ మరోసారి జత కలిశారు. వినోదంతో పాటు సామాజిక విలువలతో చిత్రాలు అందించే రాజు మురుగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు- డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రాజు మురుగన్ కాంబినేషన్లో వచ్చిన 'జోకర్' జాతీయ అవార్డు గెలుచుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ కార్తి 'జపాన్' కోసం రాబోతుంది. కార్తికి ఇది 25వ సినిమా కావడం విశేషం.
ఈ చిత్ర పూజా కార్యక్రమాలు మంగళవారం ఉదయం గ్రాండ్గా జరిగాయి. త్వరలోనే తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో తొలిసారి కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్ జోడి కడుతోంది. అల్లు అర్జున్ 'పుష్ప'లో మంగళం శీను పాత్రలో ఆకట్టుకున్న సునీల్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో ఆయన కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో సినిమాటోగ్రాఫర్గా 25 ఏళ్ల అనుభవంతో పాటు 'కోలి సోడా', 'కడుగు' వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను నిరూపించుకున్న విజరుమిల్టన్ ఈ చిత్రంలో తొలిసారిగా నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.