Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'సీఎస్ఐ సనాతన్'. చాగంటి ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి శివశంకర్ దేవ్ దర్శకుడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్లో గ్రిప్పింగ్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర టీజర్ను తాజాగా దర్శకుడు బాబి విడుదల చేశారు. టీజర్ బాగుందంటూ ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
'ఈ టీజర్లో విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ పర్మార్మెన్స్ చూపించారు. ఒక హత్య జరిగిందంటే హంతకుడు తప్పకుండా ఉంటాడు. ఐదుగురు అనుమానితులు ఐదు డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నారు. వాటిలో ఏది నిజం అనేది ఆయన విచారణలో తెలుసుకునే క్రమం ఆసక్తిగా ఉండనుంది. నౌ ద రియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్ అనే డైలాగ్తో టీజర్ ఇంట్రెస్టింగ్గా ముగిసింది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని చిత్రబృందం తెలిపింది.
మిషా నారంగ్, అలీ రెజా, నందిని రారు నటిస్తున్న ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ : జి. శేఖర్, మ్యూజిక్ : అనీష్ సోలోమాన్, నిర్మాత : అజరు శ్రీనివాస్.