Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జస్ట్ ఆర్టినర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.2 మూవీగా రూపొందుతున్న చిత్రం 'మాయా పేటిక'. రమేష్ రాపార్తి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాకు గుణ బాల సుబ్రమణియమ్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కామెడీ, డ్రామా జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను అనసూయ భరద్వాజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ, 'ఈ సినిమా స్క్రిప్ట్ సరికొత్తగా ఉంటుంది. సెల్ ఫోన్ ఆధారంగా ఈ స్క్రిప్ట్ రూపొందించాం. మీ సెల్ ఫోన్లో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఈ సినిమాలో కూడా మంచి విజువల్స్, మంచి సాంగ్స్, మంచి కామెడీతో ఇది ఫుల్ ప్యాకేజీ సినిమాలా ఉంటుంది. ఇందులో అన్నీ ఉన్నాయి. నన్ను నమ్మిన శరత్, తారక్లకు, సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్' అని తెలిపారు.
'నేను మీలాగే ప్రతి శుక్రవారం సినిమా చూస్తుండేవాడిని. నేను కూడా ఏదో ఒక రోజు సినిమా తీయాలని అనుకున్నా. కరోనా సమయంలో 'థ్యాంక్యూ యూ బ్రదర్' మూవీ ద్వారా కొత్త కథను, కొత్త సినిమాను మీ ముందుకు తీసుకువచ్చా. మీరిచ్చిన ధైర్యంతో రెండో సినిమాగా 'మాయ పేటిక'ను నిర్మించాను. ఇదొక సెల్ఫోన్ బేస్ ఆధారంగా తీశాం. ఈ సినిమాకు సహకరించిన నటీనటులు, డైరెక్టర్ రమేష్ అందరికీ థ్యాంక్స్' అని నిర్మాత శరత్ అన్నారు.
అనసూయ మాట్లాడుతూ, 'జస్ట్ ఆర్డినరీ బ్యానర్ అంటే నాకు ఫ్యామిలీ లాంటిది. మళ్లీ ఇలా అందరినీ ఇక్కడ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూశాను. చాలా చాలా బాగుంది. సినిమా అందరికీ నచ్చుతుంది. నేను ఈ సినిమాలో నటించకపోయినా చెబుతాన్నంటే అర్థం చేసుకోండి. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది' అని చెప్పారు.