Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వన్ మీడియా ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్పై జయంత్ వదాలి, శగ శ్రీ, చలాకీ చంటి, ఇమ్మాన్యుయేల్ తదితరులు నటీనటులుగా తెరకెక్కిన చిత్రం 'బెస్ట్ కపుల్'. గణేష్ దొరల దర్శకత్వంలో పార్థు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 18న థియేటర్స్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత పార్థురెడ్డి మాట్లాడుతూ, 'రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తున్నారు. అలాగే మా సినిమాని కూడా ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం' అని తెలిపారు. 'భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలు, గొడవలు, ప్రేమాభిమానాలు ఇలా అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. అందరికీ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఈ చిత్రంలో మూవీలో ఉన్నాయి. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది' అని డైరెక్టర్ గణేష్ దోరాల అన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ : మహర్ష్ రవి చంద్ర, రైటర్: అభిషేక్ మోగలపు.