Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి తాజాగా నటిస్తున్న మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్స్ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ఈ వారమే విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. 'ఇప్పుడే 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ సాంగ్ చూశాను. మెగాస్టార్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ సింగల్ ఈ వారమే రిలీజ్ అవుతుంది. పార్టీకి సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే ఇది బాస్ పార్టీ' అని ట్వీట్లో పేర్కొన్నారు. చిరంజీవి, ఊర్వశి రౌతేలా పై ఓ భారీ సెట్లో ఈ స్పెషల్ సాంగ్ని చిత్రీకరించారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇదే పాటని ఈ వారం విడుదల చేస్తున్నారు మేకర్స్. చిరంజీవి- దేవిశ్రీ ప్రసాద్ది చార్ట్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు మ్యజికల్గా ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు ఈ చిత్ర ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటివలే విడుదలైన ఈ చిత్ర టైటిల్ టీజర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ వింటేజ్ అవాతర్ ఫ్యాన్స్ని మెస్మరైజ్ చేసింది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, గెటప్, మ్యానరిజమ్స్ మాస్కు పూనకాలు తెప్పించింది. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది' అని చిత్ర బృందం తెలిపింది.