Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గాలోడు'. గెహ్నా సిప్పి నాయిక. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించింది. ఈ చిత్రం ఈనెల 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ గెహ్నా సిప్పి మీడియాతో ముచ్చటించారు.
''మాది ముంబై. నేను ఇందులో నేను ఓ అమ్మకూచి, నాన్నకూచిలాంటి పాత్రను పోషించాను. కాలేజ్ గర్ల్, క్యూట్ గర్ల్గా కనిపిస్తాను.
ఇది నా రెండో చిత్రం.
ఈ సినిమాపై ఎంతో పాజిటివ్గా ఉన్నాను. సుధీర్ ఎక్కువగా సిగ్గుపడుతుంటారు. ఆయన చాలా మంచి వ్యక్తి. టౌన్ కాలేజ్ గర్ల్, మాస్ అబ్బాయి మధ్య జరిగే లవ్ స్టోరీనే ఈ సినిమా. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది.. దాని తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో ఐదు పాటలుంటాయి. నేను మూడు పాటల్లో కనిపిస్తాను. డైరెక్టర్ రాజశేఖర్ ఎంతో కామ్గా ఉంటారు. నిర్మాత మమ్మల్ని ఎంతో కంఫర్ట్గా చూసుకున్నారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. శేఖర్ కమ్ములతో పని చేయాలని ఉంది. ఆయన తీసిన 'ఫిదా' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. దర్శకులు సుకుమార్, హీరోల్లో ధనుష్, నాగ చైతన్య, రామ్ చరణ్లంటే చాలా ఇష్టం' అని గెహ్నాసిప్పి చెప్పింది.