Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ మహేష్బాబు అటు హీరోగా, ఇటు నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. అయితే తన సోదరుడు రమేష్బాబుని పోగొట్టుకున్న బాధలో ఉన్న మహేష్బాబు కోలుకునేలోపే ఆయన తల్లి ఇందిరాదేవి చనిపోయారు. ఆ బాధ నుంచి తేరుకునేలోపే తండ్రి కృష్ణ మరణం ఆయన్ని మళ్లీ విషాదంలోకి నెట్టేసింది. ఈ కష్టకాలంలో మహేష్కు శక్తినివ్వాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు ధైర్యానిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 8న మహేష్బాబు సోదరుడు రమేష్బాబు కాలేయ సంబంధిత వ్యాధితో మరణించగా, ఆయన తల్లి ఇందిరా దేవి అనారోగ్య సమస్యతో సెప్టెంబర్ 28న కన్నుమూశారు. నవంబర్ 15న తండ్రి కృష్ణ మహేష్కు శాశ్వతంగా దూరమయ్యారు. ఇదే ఏడాది వరసగా ముగ్గురు కుటుంబ సభ్యుల్ని మహేష్బాబు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ తరుణంలో మేం ఉన్నామంటూ ఫ్యాన్స్ ఆయనకు ధైర్యం చెబుతున్నారు.