Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహసిని తదితరులు నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం. కన్నడ దర్శకుడు, నటుడు నాగశేఖర్ ఈ సినిమాతో టాలీవుడ్కి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ నిర్మించారు. ఈ సినిమాను చినబాబు, ఎం.సుబ్బారెడ్ది సమర్పించారు. డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సందర్భంగా ఈ చిత్రంలో సెకండ్ లీడ్ హీరోయిన్గా నటించిన కావ్య శెట్టి మీడియాతో ముచ్చటించింది.
'నేను ఎక్కువగా కన్నడ సినిమాలు చేశాను. రీసెంట్గా కన్నడలో నటించిన 'లవ్ మాక్టేల్' సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. అలాగే మలయాళం ఒకటి, తమిళంలో 3 సినిమాలు చేశాను. తెలుగులో మాత్రం నాకిది మొదటి చిత్రం. చాలా నేచురల్గా మూడు లవ్ స్టోరీస్్ (త్రీ ఏజ్ గ్రూప్స్) కలిపిన ఒక మంచి లవ్ స్టోరినే ఈ సినిమా. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా కూడా ఇందులో ఉండే లవ్ స్టోరీస్ ఏదో నార్మల్గా ఉండవు. మీ హర్ట్ని టచ్ చేసేలా ఉంటాయి. అంతేకాదు మనందరి ప్రేమకథలని గుర్తు చేస్తాయి. ఇందులో నేను కాలేజీ గర్ల్ అమ్ములు పాత్రలో నవ్విస్తాను. నా కెరీర్కి చాలా ఇంపార్టెంట్ చిత్రంగా ఇది నిలుస్తుందని భావిస్తున్నాను. నా కోస్టార్ సత్యదేవ్ చాలా హార్డ్ వర్కర్. తనతో నటించడం చాలా హ్యాపీగా ఉంది. కాలభైరవ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో నాకు రెండు సాంగ్స్ ఉంటాయి. ఈ సినిమాని ఎక్కువగా హైదరాబాద్, బెంగుళూరులోని మంచి మంచి లొకేషన్స్లో షూట్ చేశారు. యూత్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. కమర్షియల్గా ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా.. కన్నడ నుండి వచ్చిన హీరోయిన్స్ అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక, నేహా శెట్టి, కృతి శెట్టిని అదరించిన తెలుగు ప్రేక్షకులు నన్ను కూడా ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని చెప్పారు.