Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి తేజ్ కథానాయకుడిగా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్పై బాపినీడు సమర్పణలో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాతో జయంత్ పానుగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బాపినీడు భోగవల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో సాయి తేజ్ క్లాప్ కొట్టారు. హీరో సాయి తేజ్ తల్లి విజయ దుర్గ, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సతీమణి విజయ లక్ష్మి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బుచ్చి బాబు సానా సహా పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ, 'సాయి తేజ్తో మా నిర్మాణ సంస్థకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అదే అనుబంధంతో ఇప్పుడు ఆయన మా బ్యానర్లో మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంతో జయంత్ పానుగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాం. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం' అని అన్నారు.