Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వీరసింహారెడ్డి'. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి బిగ్ అప్డేట్ని మేకర్స్ ప్రకటించారు. జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్టు రిలీజ్ డేట్ పోస్టర్తో మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ పోస్టర్లో బాలకృష్ణ సీరియస్ లుక్లో తన శత్రువులను హెచ్చరిస్తున్నట్లు కనిపించడం అందర్నీ ఆకట్టుకుంటోంది.
'సంక్రాంతి తెలుగువారికి అతిపెద్ద పండుగ. ఇది బాలకృష్ణకు పాజిటివ్ సెంటిమెంట్ కూడా. పండుగకు విడుదలైన బాలకృష్ణ అనేక సినిమాలు ఇండిస్టీ హిట్లు, బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. పండుగ సెలవులు భారీ ఓపెనింగ్స్ను రాబట్టడానికి అనుకూలంగా ఉండబోతున్నాయి. బాలకృష్ణ మునుపెన్నడూ లేని మాస్ అవతార్లో కనిపిస్తున్న ఈ చిత్రం మాస్లో భారీ అంచనాలని క్రియేట్ చేసింది. టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ 'జై బాలయ్య..' యూట్యూబ్లో సంచలనం సృష్టించింది' అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా, దునియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని, సంగీతం: తమన్, డివోపీ: రిషి పంజాబీ, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంకట్, సిఈవో: చిరంజీవి (చెర్రీ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి.