Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం. కన్నడ దర్శకుడు, నటుడు నాగశేఖర్ ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని చినబాబు, ఎం.సుబ్బారెడ్ది సమర్పించగా, కాలభైరవ సంగీతాన్ని అందించారు. ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగ శేఖర్ మాట్లాడుతూ, 'తెలుగులో ఇది నా డెబ్యూ ఫిలిం. ఎక్కడికి వెళ్లిన ఈ టైటిల్ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. క్రెడిట్ గోస్ టూ హీరో సత్యదేవ్. ఈనెల 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని తప్పకుండా చూడండి' అని తెలిపారు.
'ఈ సినిమాలో నాలుగు డిఫెరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఈ సినిమా ఫోర్ ఫేజ్ స్ అఫ్ లైఫ్. ఈ నాలుగు ఫేజ్స్ అయిపోయినవాళ్లు ఉంటారు. ప్రెజెంట్ ఆ ఫెజ్ రన్ అయ్యేవాళ్ళు ఉంటారు. అందరికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అన్ని సెక్షన్స్కి ఇంతకంటే బాగా కనెక్ట్ అయ్యే ఫిల్మ్ ఎవరు చేయలేరేమో. ఈ సినిమాకి భూపాల్ రాసిన డైలాగ్స్ నేరేట్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా నవ్వుతూనే ఉన్నాం. ఈ సినిమా కథ విన్నపుడు ఎలా ఫీల్ అయ్యామో సినిమాను కూడా అదే ఫీల్తో తెరకెక్కించాడు నాగశేఖర్. ఈ జనరేషన్కి ఒక గీతాంజలి లేదు. ఈ జనరేషన్ గీతాంజలి అన్నట్లు ఈ సినిమాని చేశాడు. ఈ సినిమాలో నటించిన తమన్నా, మేఘ ఆకాష్, కావ్యాశెట్టికి కృతజ్ఞతలు. కాలభైరవ ఈ సినిమాకి మంచి సంగీతం అందించారు. ఈ శీతాకాలంలో ఈ సినిమా గుర్తుండిపోతుంది. ఇలాంటి మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు ధన్యవాదాలు' అని హీరో సత్యదేవ్ అన్నారు.
మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని తదితరులు నటించిన ఈ చిత్రానికి కొరియోగ్రఫీ - వీజేశేఖర్, లైన్ ప్రొడ్యూసర్స్ - సంపత్, శివ ఎస్. యశోధర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నవీన్ రెడ్డి, డైలాగ్స్ - లక్ష్మీ భూపాల్, మ్యూజిక్ - కాలభైరవ, ఎడిటిర్ - కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రాఫర్ - సత్య హెగ్డే, స్టంట్స్ - వెంకట్.