Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళింగ ఆర్ట్ క్రియేషన్స్ బేనర్పై గూన అప్పారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'విప్లవ సేనాని వీర గున్నమ్మ'.
ఆదిత్య భరద్వాజ్, మహీరా హీరో, హీరోయిన్లుగా నటించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1940 ఏప్రిల్ 1న జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉంది. ఈ చిత్రాన్ని ఈనెల మూడో వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత గూన అప్పారావు మాట్లాడుతూ, 'శ్రీకాకుళం జిల్లాలోని మందస ప్రాంతంలో జరిగిన జమీందారి వ్వతిరేక పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ పోరాటాన్ని సంఘటన స్థలంలోనే భారీగా చిత్రీకరించాం. అప్పుడు జరిగిన పోరాటంలో ఐదుగురు రైతులతో పాటు, ఇద్దరు పోలీసులు మృతి చెందారు. తర్వాత 15 రోజుల వ్యవధిలో తీవ్రంగా గాయపడ్డ 25 మంది రైతులు, ఏడుగురు పోలీసులు మరణిస్తారు. 42 మంది రైతులకు బ్రిటిష్ ప్రభుత్వం మరణ శిక్ష విధిస్తుంది. ఈ నేపథ్యాన్ని ఎంతో సహజంగా, అప్పటి నేటివిటీ మిస్ కాకుండా చిత్రీకరించాం. ఇటీవల మా చిత్రానికి సంబంధించిన పోస్టర్, టీజర్లను శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ప్రముఖ వైద్య నిపుణుడు డా. డానేటి శ్రీధర్ విడుదల చేశారు. ప్రస్తుతం మా చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు జరుగుతున్నాయి. త్వరలో పాటలు రిలీజ్ చేసి, సినిమాను ఈనెల మూడో వారంలో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. ఎల్.వి.చలం, లజపతిరారు, హేంబాబు చౌదరి, చేపర వేణుగోపాల్, హేమసూదన్, ఎమ్ఎన్ మూర్తి, స్టాలిన్, బమ్మిడి కృష్ణారవు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, చిన్నికృష్ణ, కెమెరా: ఇజాజ్ వెంకట్ రవి, ఎడిటర్: వంశీ, రచన-దర్శకత్వం-నిర్మాత : గూన అప్పారావు.