Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి రామ్శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'వెరు దరువెరు'. చిత్ర టైటిల్ సాంగ్ 'వెయ్..దయ్వెయ్'ను 'హీరో నాగ చైతన్య రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ పాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా చూడాలి అని కూతుహలాన్ని కలిగించింది. సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి' అని తెలిపారు.
'మా సినిమా నుంచి విడుదలైన రెండవ సాంగ్ ఇది. మొదటి సాంగ్ 'మంజుల మంజుల..' 5 మిల్లియన్ వ్యూస్కి రీచ్ అయింది. చాలా మంచి విశేష స్పందన వచ్చింది రెండవ సాంగ్ టైటిల్ సాంగ్. మా మూవీ నుంచి వస్తున్న బెస్ట్ డాన్స్ నెంబర్ సాంగ్. మీకు తప్పకుండా నచ్చుతుంది' అని హీరో సాయి రామ్ శంకర్ చెప్పారు.
దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ, 'ఈ సినిమా కథ చెప్పగానే, సింగిల్ సిట్టింగ్లో మా హీరో సాయి అంగీకరించారు. ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని జయించాననే అనుకుంటున్నాను. అలాగే కథ మీద నమ్మకంతో మా నిర్మాత దేవరాజ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. లేటెస్ట్గా విడుదలైన టైటిల్ సాంగ్ 'వెరు దరువెరు'కి కూడా విశేష ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. అలాగే సినిమా సైతం ఇదే రీతిలో ప్రేక్షకలోకాన్ని అలరిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాం' అని అన్నారు.
నిర్మాత దేవరాజ్ మాట్లాడుతూ, 'నవీన్ చెప్పిన కథ నాకెంతో బాగా నచ్చింది. ఎంత ఖర్చు అయిన సరే నేను పెడతాను అని కథ మీద నమ్మకంతో ముందుకు వచ్చాను. మేము అనుకున్నట్టే సినిమా చాలా బాగా వచ్చింది. హీరో సాయి కెరీర్లో మరొక మంచి సినిమా అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.
సాయి రామ్ శంకర్, యాశ శివ కుమార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, కాశీ విశ్వనాథ్, పోసాని కృష్ణ మురళి, పృధ్వీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్, కెమెరా మెన్ : ముత్యాల సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :జనగాని కార్తీక్, శ్రీపాల్ చొల్లేటి.