Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'భలే భలే మగాడివోరు, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, 18 పేజెస్' లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు పెరిగాయి.
తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన 'వాసవసుహాస', 'బంగారం' పాటలకు, చిత్ర టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ చిత్రం నుంచి 'దర్శన' సాంగ్ లిరికల్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. భాస్కర భట్ల రవికుమార్ రచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. 'మనసే మనసే తననే కలిసే, అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా, తనతో నడిచే అడుగే మురిసే' అని స్టార్ట్ అయ్యే ఈ బ్రేకప్ సాంగ్లోని 'తట్టుకోవడం కాదే పిల్ల నావల్లా వయ్యారి, గుక్కపట్టి ఏడుస్తుందే నా ప్రాణం నీవల్లా' లాంటి లిరిక్స్ యూత్కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇదివరకే కిరణ్ 'ఎస్.ఆర్ కల్యాణమండపం' సినిమాకి మంచి సాంగ్స్ రాసిన భాస్కర భట్ల ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో పాటలను రాశారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. సత్యగమిడి, శరత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాతలు. ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది.