Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ డ్రామా చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే.
2022లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొంది, ప్రతిష్టాత్మక ఆస్కార్స్కి సైతం నామినేట్ అయిన 'ఆర్ఆర్ఆర్' వంటి సంచలన విజయం తర్వాత డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది.
ఈ ప్రతిష్టాత్మక చిత్ర పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్లో సోమవారం ఘనంగా జరిగింది.
ఈచిత్ర ముహూర్తపు షాట్కి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అల్లు అరవింద్, దిల్ రాజు చేతుల మీదుగా చిత్ర దర్శక,నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు. ''రన్ రాజా రన్', 'సాహో' చిత్రాలతో ప్రతిభగల దర్శకుడిగా సుజీత్ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కలిసి పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాను అందించడానికి సిద్ధమవుతున్నారు. భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఇమేజ్కి సరిగ్గా సరిపోయే కథతో యాక్షన్ డ్రామాగా సుజీత్ రెడీ చేశారు. థమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం, అద్భుతమైన ఇతర సాంకేతిక వర్గం ప్రతిభ తోడై అటు యాక్షన్ ప్రియులకు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత డీవీవీ దానయ్య తెలిపారు.
చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను చిత్ర బృందం త్వరలోనే తెలియజేయనుంది. ఈ చిత్రానికి నిర్మాత: డీవీవీ దానయ్య, దర్శకత్వం: సుజీత్, సంగీతం: ఎస్.తమన్, సినిమాటోగ్రాఫర్: రవి కె చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్.