Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుహాస్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛారు బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పించారు. ఈ సినిమా ప్రిమియర్స్కు ప్రేక్షకుల నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, విశేష ప్రేక్షకాదరణ రాబట్టుకుంది.
ఈ నేపథ్యంలో హీరో సుహాస్ మాట్లాడుతూ.. 'అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందు ప్రిమియర్స్ చాలా ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయి. చాలా ఆనందంగా వుంది. నా మొదటి థియేటర్ రిలీజ్ ఇది. సినిమా చూసిన చాలా మంది నన్ను దీవిస్తుంటే అనందంతో నాకు మాట రాలేదు. ఇలాంటి ఓ మంచి సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉంది. కొత్త దనంతో సినిమా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని మా సినిమా నిరూపించింది. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో భవిష్యత్తులోనూ మరిన్ని మంచి సినిమాలతో అలరిస్తాను. ఈ విజయాన్ని జీవితంలో మరచిపోలేను' అని అన్నారు.
శరత్ మాట్లాడుతూ, 'మేము సక్సెస్ కొట్టేసినట్లు ఫీలౌతున్నాం. గత ఆరు రోజులుగా.. విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ కి టీం అంతా వెళ్లి అక్కడ కొందరితో కలిసి వాళ్ళన్ని థియేటర్లోకి తెచ్చాం. ప్రేక్షకులు సినిమా చూస్తున్నపుడు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి థియేటర్లో అందరూ గట్టిగా నవ్వడం మర్చిపోలేని అనుభూతి. చాలా అద్భుతమైన రెస్పాన్ వచ్చింది. ఒక పెద్ద స్టార్కి ఉండే రెస్పాన్స్ మా మొదటి సినిమాకి వుండటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వర్డ్ అఫ్ మౌత్ ని నమ్ముకొని వెళ్తున్నాం. మీకు సినిమా నచ్చితే మరో పది మందికి చెప్పండి. ఈ సినిమా టికెట్ రేట్లు తగ్గించాం. మల్టీ ప్లెక్స్ లో 150( జీఎస్టీతో కలుపుకొని). తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక , యుఎస్ , కెనడా, ఆస్ట్రేలియా లో విడుదలై మంచి ఆదరణ పొందింది' అని అన్నారు.
షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ, 'సినిమా చూసిన ప్రేక్షకులు రియాక్షన్ చూస్తుంటే ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. మా సినిమానిపెద్ద హిట్ చేశారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమా రేంజ్లో ఆదరణ పొందుతోంది. ఓ మంచి సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు.
నాయిక టీనా శిల్పరాజ్ మాట్లాడుతూ,' ఇది నా మొదటి సినిమా. ప్రేక్షకుల ఆదరణ, స్పందన చూసినపుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాలో భాగం కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అందరూ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను' అని అన్నారు.
గౌరీ మాట్లాడుతూ,' చాలా గొప్పగా ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూడాలి' అని చెప్పారు.
చంద్రు మనోహర్ మాట్లాడుతూ, 'ఇప్పటికే ఆరు స్క్రీన్స్ అయ్యాయి. అద్భుతమైన స్పందన వచ్చింది. లహరి మ్యూజిక్ 35 ఏళ్లుగా మ్యూజిక్ ఇండిస్టీలో వుంది. తొలిసారి ఈ చిత్రంతో ప్రొడక్షన్ చేయడం ఆనందంగా వుంది. విజయం సాధించిన ఆనందం వుంది. మీ అందరి సపోర్ట్ కావాలి' అని చెప్పారు. కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ, 'ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇది మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది' అని అన్నారు.