Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి తాజాగా తీసిన
చిత్రం 'యూనివర్శిటీ'.
ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ,'
'40 ఏళ్ళ సినిమా కెరీర్లో ఇది నా 30వ సినిమా. విద్యా వ్యవస్థ మీద ఈ
సినిమా ఉంటుంది. విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాను. అక్కడ నాకు సహకరించిన మంత్రి బొత్స సత్యనారాయణకి థ్యాంక్స్. ధన్యవాదములు. వైజాగ్ సత్యానంద్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న స్టూడెంట్స్ ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో విద్యా వ్యవస్థ, వైద్య సంస్థలు రెండు సేవా రంగాలు అని రాజ్యాంగం చెపుతుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఈ రెండు రంగాలను ప్రైవేటు పరంగా కాకుండా ప్రభుత్వమే నిర్వహించేలా ఉండాలి. విద్యార్థులు జాతి సంపద వారిని కుల, మత భేదం లేకుండా ప్రోత్సహించాలి. విద్య ఇప్పుడు ప్రైవేటు పరం అయిపోతుంది. భారత దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో తీసాను. ప్రధాని నరేంద్రమోడీ సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయకుండా మీరిచ్చిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని తెలిపారు.
'ఆర్ నారాయణమూర్తి స్నేహాచిత్ర పిక్చర్స్ బ్యానర్ పెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు. కళా దర్శకులు ఉన్నారు, వ్యాపారాత్మక దర్శకులు ఉన్నారు. కానీ ప్రజా దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఒక్కడే. చలన చిత్రం అనే సముద్రం వంక అందరూ చూస్తే, ఆ సముద్రం చూసే అరుదైన వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటు పడే వ్యక్తి. విద్యా వ్యవస్థ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తీశారు. అప్పటిలో ఉన్న చదువు ఇప్పుడు లేదు. అప్పుడున్న గౌరవం ఇప్పుడు లేదు. ఇప్పటి గురుశిష్యుల సంబంధం ఏ బార్లోనో ఎక్కడో చూడవచ్చు. ఇపుడు చదువుకొనే రోజులొచ్చాయి. కొన్ని యూనివర్సిటీలు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. విద్యావ్యవస్థ మాఫియా కథాంశంతో తీశారు. విద్యా వ్యవస్థ ఉన్న లోపాలు తెలుసుకోవాలి అంటే ఈ సినిమా తప్పకుండా చూడండి' అని బ్రహ్మానందం చెప్పారు.