Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో ఆది సాయికుమార్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ఐ) ఆఫీసర్గా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'సీఎస్ఐ సనాతన్'. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్తో చిత్రం పై అంచనాలు బాగా పెరిగాయి. విక్రమ్ అనే ప్రముఖ యువ పారిశ్రామికవేత్త హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్గా ఆది సాయికుమార్ ఇంటెన్స్ పర్మార్మెన్స్తో, గ్రిప్పింగ్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ చిత్రానికి శివశంకర్ దేవ్ దర్శకత్వం వహించగా, చాగంటి ప్రొడక్షన్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. మర్చి 10న థియేటర్లలో విడుదలవనున్న ఈ సినిమా విజయంపై నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు.
ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రారు, తాకర్ పొన్నప్ప, మధు సూదన్, వాసంతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి. శేఖర్, మ్యూజిక్: అనీష్ సోలోమాన్, నిర్మాత: అజయ్ శ్రీనివాస్.