Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ వెంకటేశ్వరస్వామి మూవీస్ పతాకంపై ప్రదీప్ రాజ్ దర్శకత్వంలో రమేష్ ఆర్.కె. నిర్మిస్తున్న చిత్రం మిస్టర్ ధర్మ (బ్రదర్ ఆఫ్ యమ). ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక ఫిలింఛాంబర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిర్మాత, ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. రచయిత, దర్శకుడు వడ్డేపల్లి కష్ణ, దర్శకుడు బాజ్జీ, నటుడు కోట శంకరరావు, శాంత కుమార్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. చిత్ర నిర్మాత రమేష్ ఆర్.కె మాట్లాడుతూ, 'ముంబయి ప్రాంతానికి చెందిన తెలుగువాడిని. మంచి కథా బలం ఉన్న చిత్రాల నిర్మాణం కోసం ఇండిస్టీకి వచ్చాను. పోలీస్ స్టోరీ బ్యాక్డ్రాప్లో సినిమా చేయడానికి దర్శకుడిని కథ చెప్పమని అడిగాను. నా భావాలకు అనుగుణంగా మంచి సన్నివేశాలు, పాటలు, ఫైట్స్ ప్రాధాన్యతను ఇస్తూ చిత్రాన్ని అనుకున్న విధంగా దర్శకుడు పూర్తి చేసారు. భానుచందర్, కోట శంకరరావు, శాంతి కుమార్ తదితరులు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. కామెడీ, రొమాన్స్కి కూడా మంచి ప్రాధాన్యత ఉంది. త్వరలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.