Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ కీలక పాత్రధారులుగా సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన చిత్రం 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మాత. మహా శివరాత్రి కానుకగా ఈ నెల 18న విడుదల కానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో ఫిల్మ్ఛాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ 'ఇప్పటి వరకురాని కామెడీ, హర్రర్ థ్రిల్లర్ ఇది. మామూలుగా నేను ఏ కథ అనుకున్నా.. దాసరిగారి సలహా తీసుకునేవాణ్ణి. ఆయన లేకపోవడంతో తమ్మారెడ్డి సలహాలతోపాటు దర్శకుడు అజరు, చదలవాడ శ్రీనివాసరావు సూచనలు తీసుకుని ఈ సినిమా చేశాం. ఫైనల్గా ప్రసన్నకుమార్ అనుకున్నట్లు కథ కుదిరింది. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. 'రేలంగి నరసింహారావు చేస్తున్న 76వ చిత్రం. చక్కని కథతో తెరకెక్కించారు. కాశ్మీర్, హైదరాబాద్ ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్లో చిత్రీకరణ చేశాం. ఫస్ట్ కాపీ చూశాం. అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. పాటలు చక్కగా కుదిరాయి. ఇందులో కామెడీ, హర్రర్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చాలామందికి సినిమా చూపించాం. అందరికీ బాగా నచ్చింది' అని నిర్మాత ప్రసన్నకుమార్ చెప్పారు.