Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏబి సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ పతాకంపై అంజి వల్గుమాన్, రాజవ్వ, సుధాకర్ రెడ్డి, డా||కీర్తి లత గౌడ్, అభిరామ్, రూప శ్రీనివాస్, సాయి ప్రసన్న నటీనటులుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'భీమదేవరపల్లి బ్రాంచి'. డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, నాయకులు అద్దంకి దయాకర్ ఈ చిత్రంలో నటించటం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ను గురువారం మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మంచి కాన్సెప్ట్తో వస్తున్న ఈ చిత్ర టీజర్ను చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. మంచి మెసేజ్ ఉన్న సినిమా అని అర్థం అవుతోంది. పూర్తి సినిమాను తప్పకుండా చూస్తాను' అని తెలిపారు.
'ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దర్శకుడు రమేష్ చెప్పాల మంచి విషయాన్ని కామెడీ వేలో చెప్పడంతో జనాలకి ఈ సినిమా ఈజీగా రీచ్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. సినిమాని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత డా|| బత్తిని కీర్తీ లత గౌడ్ అన్నారు.