Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయిరామ్ శంకర్, యాశ శివకుమార్ జంటగా నటిస్తున్న చిత్రం 'వెరు దరువెరు'. ఈ చిత్ర టీజర్ను హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. అంతేకాదు సినిమా చూడాలి అనే కూతుహలాన్ని రేపుతోంది. సినిమా ఖచ్చితంగా సక్సెస్ అయి సాయికి, డైరెక్టర్, ప్రొడ్యూసర్కి మరిన్ని అవకాశాలు రావాలని ఆశిస్తున్నాను' అని చెప్పారు.
'మా సినిమా నుంచి ఇది వరకే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి మంచి విశేష స్పందన వచ్చింది. యూట్యూబ్లో ట్రెండ్ అవ్వడమే కాకుండా కోటికి పైగా వ్యూస్ రావటం చాలా ఆనందంగా ఉంది. పాటలు ఎలా అయితే నచ్చాయో సినిమా టీజర్ అంతకు మించి ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది' అని హీరో సాయి రామ్ శంకర్ అన్నారు. దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ, 'మా సాంగ్స్కి మంచి రీచ్ ఇచ్చిన ప్రేక్షకులకి నా శతకోటి నమస్కారాలు. టీజర్ కూడా బాగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను' అని తెలిపారు.నిర్మాత దేవరాజ్ మాట్లాడుతూ, 'సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా మా సినిమా టీజర్ రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. మేము అనుకున్నట్టే చాలా బాగా వచ్చింది సినిమా, హీరో కెరీర్లో మరొక మంచి సినిమా అవుతుంది అని మేమంతా గట్టిగా నమ్ముతున్నాం' అని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సమ్మర్ స్పెషల్గా మార్చిలో ఈ సినిమా రిలీజ్కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సాయి రామ్ శంకర్ , యాశ శివ కుమార్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, కాశీ విశ్వనాథ్, పోసాని కష్ణ మురళి,పథ్వి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ : నవీన్ రెడ్డి, ప్రొడ్యూసర్ : దేవరాజు పొత్తూరు, మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్, కెమెరా మెన్ : ముత్యాల సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :జనగాని కార్తీక్ , శ్రీపాల్ చొల్లేటి.