Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హ్రిదు హరూన్ను హీరోగా పరిచయం చేస్తూ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించిన చిత్రం 'కోనసీమ థగ్స్'. సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ తనయురాలు రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై జియో స్టూడియోస్ భాగస్వామ్యంతో భారీ స్థాయిలో నిర్మించారు.
టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఇటీవలే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి పేరిట పంపిణీ రంగంలోకి కూడా ప్రవేశించారు. సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన భారీ చిత్రాలు 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి'ని నిర్మించడమే కాకుండా ఒకే సమయంలో నైజాం ఏరియాలో రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. ఆద్యంతం ఉత్కంఠ రేపేలా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్, పోస్టర్స్, అమ్మన్ సాంగ్ చూసి ఇంప్రెసై తెలుగు వెర్షన్ను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి ద్వారా అన్ని ఏరియాల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్తో అంచనాలు పెంచేసిన 'కోనసీమ థగ్స్' ఇటీవల విడుదలైన 'అమ్మన్' పాటతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో సినిమా పట్ల మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మైత్రి సంస్థ జత కలవడంతో, చిత్రం భారీ స్థాయిలో ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నెల 19న ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.