Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ వెంకట్, భవ్యశ్రీ ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్ఎస్ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజ నేయులు దర్శకత్వంలో పెద్దరాసు సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న 'సతీ తిమ్మమాంబ' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి, మలి సీడీలను ఎపి మంత్రులు పల్లె రఘునాథ్రెడ్డి, పరిటాల సునీతలకు అందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, 'అనంతపురం జిల్లా లోని బుక్కపట్నం, కదిరి లాంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయి. ఆ జిల్లాలో 7 ఎకరాల్లో ఉన్న తిమ్మమాంబ మర్రిమాను గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది. శ్రీకృష్ణదేవరాయలు కుటుంబానికి చెందిన తిమ్మమాంబ భర్తతో పాటు సతీసహగమనం చెందింది. ఆవిడ జీవితచరిత్రను చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగుదనానికి ఆదరణ తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి చిత్రాలు రావడం అభినందనీయం. బండారు దానయ్య మంచి సంగీతమందించారు. ఈ చిత్రం విజయం సాధించి యూనిట్కు మంచి పేరు తీసుకు రావాలి' అని అన్నారు. 'నాటుకోడి కూర అనే పాటకు బాలకృష్ణ చేతుల మీదుగా అవార్డు తీసు కున్నాను. కళలన్నా, కళాకారులన్నా ఆయనకు ఎంతో అభిమానం' అని సంగీత దర్శకుడు బండారు దానయ్య కవి తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ, 'భైరవ ద్వీపం' చిత్రం చూశాక పాత్రల తీరు తెన్నులు ఎలా ఉండాలో నిర్ణయించుకున్నాను. ఆ చిత్రం కంటే మా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది' అని చెప్పారు. 'మా కుటుంబ చరిత్రను నాన్న ద్వారా తెలుసుకున్నప్పుడే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా చేయడానికి మంత్రులు రఘనాథ్రెడ్డి, పరిటాల రవీంద్రలు బాగా సహకరించారు. ముందుగా ఈ కథపై సీరియల్ తీసి పది ఎపిపోడ్స్ చేశాం. కాని తర్వాత స్లాట్ దొరక్క పోవడంతో మొత్తం ప్రదర్శించ లేకపోయాం' అని నిర్మాత అన్నారు.
ఇంకా ఈ వేడుకలో నారాయణ స్వామి, సి.కళ్యాణ్, అబ్దుల్ గని, చంద్రబోస్, ఆర్.పి. పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.