Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శ్రీమంతుడు' చిత్రంతో ఊరిని దత్తత తీసుకోవడమనే ట్రెండ్కు తెరలేపిన మహేష్ బాబు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలోగల సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సిద్ధాపురం గ్రామస్థులు మహేష్బాబును కలిశారు. ఆల్ ఇండియా కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఖాదర్ గోరి ఆధ్వర్యంలో గ్రామస్థులు 'బ్రహ్మోత్సవం' షూటింగ్లో ఉన్న మహేష్ని కలిసి తమ ఊరిని దత్తత తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సిద్ధాపురం గ్రామానికి రావాలని ఈ సందర్భంగా మహేష్ని కోరారు. గ్రామస్థులతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడిన మహేష్ త్వరలో తప్పకుండా గ్రామానికి వస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సమ్మ, ఎంపీటీసీ బాలయ్య, శివాజీ యూత్, యువజన సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.