Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్లో నటీనటులు కేవలం నటనకే పరిమితం కాకుండా తమకున్న ప్రతిభతో వివిధ విభాగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కథానాయికల విషయానికొస్తే ప్రియాంక చోప్రా, అనుష్కశర్మ వంటి తదితర నాయికలు ఇప్పటికే నిర్మాణంలోకి అడుగిడి తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే మరికొంత మంది వివిధ వ్యాపారాల్ని ప్రారంభించి మరింత మంచి గుర్తింపు కోసం శతవిధాలా కృషి చేస్తున్నారు. వీరి బాటలోనే శ్రద్ధాకపూర్ కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. శ్రద్ధా మంచి నటే కాదు మంచి డాన్సర్ కూడా. ఈ రెండింటితోపాటు పాడటంలో కూడా ప్రావీణ్యం ఉంది.
'ఏక్ విలన్'లో ఓ పాట పాడి అందరి ప్రశంసల్ని పొందింది. ఇక పై కూడా సినిమాల్లో పాటలు పాడే విషయంపైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తానని అంటోంది శ్రద్ధా. తాజాగా టైగర్ షరాఫ్తో నటిస్తున్న 'బాఘీ' చిత్రంలోనూ ఓ పాట పాడేందుకు దర్శక, నిర్మాతలు శ్రద్ధాకి ఇప్పటికే గ్రీన్ సిగల్ ఇచ్చారు. వీరిచ్చిన ప్రోత్సాహంతో ఇకపై ప్రతి సినిమాలోనూ ఓ పాట పాడేందుకు ఫ్లాన్ చేసుకుంటానని శ్రద్ధా తెలిపింది.