Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనని క్రియేషన్స్ పతాకంపై శరత్ కళ్యాణ్, అభిషేక్ రంజన్, అజరు దీవా, విక్రమ్, శ్వేతా ఖడే ముఖ్య తారాగణంగా మధుసూదన్ సామల, రమేష్ బాబు పెంట సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కౌసల్య'. ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడు మహేష్ ఆపాల దర్శకుడుగా పరిచయమవుతున్నారు. త్వరలో ఆడియో విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత రమేష్బాబు మాట్లాడుతూ, 'ఇటీవలే కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో ఒక పాటతో పాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. ఆ తర్వాత హైదరాబాద్ సారథి స్టూడియోలో భారీ సెట్ వేసి ఐటమ్ సాంగ్తో పాటు పోరాట దృశ్యాలు చిత్రీకరించడంతో సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జులై మొదటి వారంలో పాటలను, ఆగస్టు చివరి వారంలో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం' అని చెప్పారు.