Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నడలో ఘన విజయం సాధించిన 'కిరిక్ పార్టీ' చిత్రాన్ని నిఖిల్ హీరోగా ఎ.కె.ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత రామబ్రహ్మం సుంకర తెలుగులో రీమేక్ చేస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం గురించి చిత్ర బృందం తెలియజేస్తూ, ''ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'కేశవ' లాంటి సూపర్ హిట్స్ అనంతరం నిఖిల్ నటిస్తున్న సినిమా కావడంతో షూటింగ్ మొదలవ్వడానికి ముందే విశేషమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాకు యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ప్లే, మరో దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు అందిస్తున్నారు. నిఖిల్తో సుధీర్ వర్మ 'స్వామిరారా', 'కేశవ' వంటి సూపర్ హిట్ను తెరకెక్కించగా, చందూ మొండేటి 'కార్తికేయ' లాంటి బ్లాక్బస్టర్ను అందించడం విశేషం. ఈ ముగ్గురి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుండటం, ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించడం ఆసక్తికరంగా మారింది. అజనీష్ లోక్నాథ్ సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఇందులోని పాత్ర కోసం నిఖిల్ మేకోవర్ ఆడియెన్స్ను బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో సంయుక్త హెగ్డేతోపాటు నటించే మరో నాయికను ఎంపిక చేస్తారు. త్వరలో ఫస్ట్లుక్ను విడుదల చేస్తాం' అని తెలిపింది.