Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అఖిల్' తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం 'హలో'. విక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. ఒక డిఫరెంట్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాజాగా మరో కథానాయికను ఎంపిక చేశారట. అఖిల్ సరసన కళ్యాణితోపాటు మరో హీరోయిన్గా నివేదిత సతీష్ను ఎంపిక చేసినట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. నివేదిత ప్రస్తుతం జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం 'మగలిర్ మత్తుమ్' చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తున్నారు.