Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో నటిస్తూ కృతి సనన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.
ఇప్పటి వరకు యువ కథానాయకులతో కలిసి నటించిన కృతి తొలిసారి ఓ సీనియర్ నటుడి సరసన నటించనుంది. నవాజుద్దీన్ సిద్దిఖీతో ఓ కామెడీ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చింది.
బాలీవుడ్ దర్శక,నిర్మాత విశాల్ భరద్వాజ్ కామెడీ నేపథ్యంలో ప్రస్తుతం ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో నవాజుద్దీన్ సిద్దిఖీ, కృతిసనన్లను ఎంపిక చేశారట. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా గ్లామర్ పాత్రలకే పరిమితమైన కృతి, కథే ప్రధానంగా సాగే చిత్రాల్లో నటించి మెప్పించే నవాజుద్దీన్ సిద్దిఖీ కలిసి నటించడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. కృతి ప్రస్తుతం 'ఫార్జి' చిత్రంలో నటిస్తుంటే, 'ది మాయా టేప్', 'కార్బన్'(లఘు చిత్రం)లో నవాజుద్దీన్ నటిస్తున్నారు.