Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది, వైభవి శాండిల్య, రష్మి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా ప్రభాకర్ దర్శకత్వంలో వీ4 పతాకంపై జ్ఞానవేల్రాజా, వంశీలతో కలిసి బన్నీవాసు నిర్మించిన చిత్రం 'నెక్ట్స్ నువ్వే'. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'విక్టరీ 4 బ్యానర్పై ఈ చిత్రాన్ని బన్నీ వాసు, జ్ఞానవేల్ రాజా, వంశీ కలిసి నిర్మించడం ఆనందంగా ఉంది. మాకు నచ్చిందే చేస్తామని, మేం అనుకున్నదే కరెక్ట్ అనుకుని చాలా మంది పెద్ద నిర్మాతలు సినిమాలు తీసి రిటైర్ అయిపోయారు. కానీ మేం ఇన్నేండ్ల పాటు ఇండిస్టీలో ఉన్నామంటే దానికి కారణం నేటి జనరేషన్ ఆలోచనలకు తగ్గట్టుగా అప్డేట్ కావడం వల్లే. ఎప్పుడూ మా చుట్టూ యంగ్ టీమ్ ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకుంటాం. దీని వల్ల మేం అప్డేట్ అవుతుంటాం. వీ4 బ్యానర్లో బన్నీవాసు, వంశీ, జ్ఞానవేల్ రాజా ఉంటారు. కొత్త కాన్సెప్ట్తో వచ్చే నూతన దర్శకులను, ఎగ్జైటింగ్ ఐడియాస్తో వచ్చే యంగ్స్టర్స్ను ప్రోత్సహించడం కోసమే ఈ బ్యానర్ స్థాపించారు. కొత్తగా వచ్చే వారు నాలుగో వ్యక్తి అవుతారు. ఎవరైనా వీ4గా జాయిన్ కావచ్చు' అని అన్నారు.
'ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేను నటించడం ఆనందంగా ఉంది. దర్శకుడు ప్రభాకర్ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. బ్రహ్మాజీ పాత్ర ఇందులో కీలకంగా ఉంటుంది. కచ్చితంగా ఆకట్టుకునే సినిమా అవుతుంది' అని హీరో ఆది తెలిపారు. దర్శకుడు ప్రభాకర్ చెబుతూ, 'మొదట అల్లు శిరీష్గారిని కలిసి కథ చెప్పాను. ఆయన ద్వారా అల్లు అరవింద్గారు పరిచయం అయ్యారు. వారికి కథ నచ్చడంతో సినిమా ఫైనల్ చేశాం. బన్నీవాసు బ్రదర్లా అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. హీరో ఎవరనుకున్నప్పుడు ఆది బెటరనిపించింది. దర్శకుడిగా నా ఫస్ట్ సినిమా రిస్క్ లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోనర్ను చేయాలని ఈ కథ ఎంచుకున్నా. విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన నలుగురు వ్యక్తులు కలిసి ఒక హోటల్ పెడితే. అందులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతుంటారు. ఆ మిస్టరీకి కారణమేంటనేది సినిమా. ఇది హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్. థ్రిల్లర్తో కూడిన హర్రర్ సినిమా. ఆద్యంతం నవ్విస్తుంది' అని అన్నారు. 'నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన చిరంజీవి, అల్లు అర్జున్, అల్లు అరవింద్గారికి థ్యాంక్స్' అని బన్నీ వాసు తెలిపారు. జ్ఞానవేల్ రాజా చెబుతూ, 'సినిమా సూపర్గా వచ్చింది. నేను తెలుగులో చేస్తున్న తొలి స్ట్రయిట్ చిత్రమిది. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆది డౌన్టు ఎర్త్ పర్సన్. చాలా బాగా నటించారు. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. నవంబర్ 3న విడుదల చేయనున్నాం. అలాగే నెక్ట్స్ మా బ్యానర్లో ఆది హీరోగా మూడు సినిమాలు నిర్మించనున్నాం' అని అన్నారు. 'ట్రైలర్ చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్తో కూడిన చిత్రమిది' అని మారుతి తెలిపారు. న