Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగార్జున, సమంత, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, అశ్విన్ ప్రధాన పాత్రధారులుగా ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓ.ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రం 'రాజుగారి గది 2'. ఈ చిత్ర ట్రైలర్ను ఏఎన్నార్ జయంతి రోజున విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇటీవల నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్లుక్, మోషన్పోస్టర్లకు మంచి స్పందన లభించింది. అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని ఈ నెల 20న ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. బ్లాక్బస్టర్ ఫ్రాంచైజ్ 'రాజుగారి గది'కి సీక్వెల్గా రూపొందుతున్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఇందులో నాగార్జున మెంటలిస్ట్(మానసిక వైద్యుడు)గా కనిపించబోతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయనున్నాం' అని అన్నారు. ప్రవీణ్, షకలక శంకర్, నరేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దివాకరన్, మ్యూజిక్: థమన్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్.