Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విలక్షణ నటుడు మోహన్బాబు నటిస్తూ శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'గాయత్రి'. మదన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతోంది. ఆ విశేషాలను చిత్ర బృందం తెలియజేస్తూ, 'సెన్సిబుల్ డైరెక్టర్ మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని కీలకమైన పాటను ప్రస్తుతం తిరుపతిలో చిత్రీకరిస్తున్నాం. దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 400 మంది డాన్సర్స్తో సుద్దాల అశోక్ తేజ రచించిన 'జయ హనుమ జై జై హనుమ..' అనే పాట చిత్రీకరణను ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య నేతృత్వంలో జరుపుతున్నాం. దీని కోసం ఆర్ట్ డైరెక్టర్ చిన్న ఆధ్వర్యంలో భారీ సెట్ రూపొందించారు. ఈ సెట్లో ఏర్పాటు చేసిన 50 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటను శంకర్ మహదేవన్ ఆలపించడం విశేషం. ఈ పాట చిత్రీకరణతో దాదాపు 50శాతం షూటింగ్ పూర్తవుతుంది. మంచి కథాబలంతోపాటు భారీ తారాగణం ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను దర్శక, నిర్మాతలు త్వరలోనే వెల్లడించనున్నారు' అని తెలిపారు.