Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రజత్, నేహా హింగే జంటగా రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్కుమార్ బృందావనం నిర్మించిన చిత్రం 'శ్రీవల్లీ'. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోన్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో సక్సెస్మీట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, 'ఈ సినిమా సక్సెస్కు కొలమాణాలు చాలా ఉన్నాయి. ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడంలో నిర్మాతలు సక్సెస్ సాధించారు. నాలాంటి దర్శకుడితో సినిమా తీయడంలో, కొత్త వాళ్ళతో సినిమా తీసి మార్కెట్ చేసుకోవడంలో, సినిమాను విడుదల చేయడంలో నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేశారు. ఇందులో రజత్ను నెగటివ్ రోల్ చూపించాను. తను చాలా బాగా చేశారు. చాలా మంది హీరోలు ముందు నెగటివ్ రోల్ చేసి, తర్వాత హీరోగా నిరూపించుకున్నారు. అలా రజత్కు కూడా మంచి భవిష్యత్ ఉంటుంది. ఈ సినిమాకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇలా అందరూ చాలా బాగా చేశారు. కానీ బాగా చేయలేనటువంటి వ్యక్తిని నేనొక్కడినే. మంచి నిర్మాతలున్నప్పటికీ సినిమాను అందరిని ఆకట్టుకునేలా తీయలేకపోయాను. ఈ విషయంలో సారీ చెబుతున్నాను. రేష్మాస్ బ్యానర్ నాకు పెంపుడు బిడ్డ లాంటిది. మున్ముందు వారికి నా సహకారం ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా మంచి కథలుంటే ఈ బ్యానర్లో చేయడానికి రావచ్చు. వారికి నా సపోర్ట్ ఉంటుంది' అని అన్నారు. 'విజయేంద్రప్రసాద్గారి దర్శకత్వంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ చిత్రం నా కోసమే తీశారనిపిస్తుంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని హీరో రజత్ తెలిపారు. నిర్మాతలు చెబుతూ, 'మా తొలి ప్రయత్నంగా రూపొందించిన ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని విడుదల చేస్తామా? లేదా అనుకున్నాం. కానీ 200లకుపైగా థియేటర్లలో విడుదల చేయగలిగాం. ఈ చిత్రం మాకు కాన్ఫిడెన్స్నిచ్చింది. ఈ ఒక్క సినిమా చేసి వెళ్ళిపోవడానికి ఇండిస్టీలోకి రాలేదు. మున్ముందు మరిన్ని మంచి సినిమాలు తీస్తాం. నెక్ట్స్ సుకుమార్ అసోసియేషన్లో సినిమా చేయబోతున్నాం. అలాగే మరికొన్ని కథలు కూడా వింటున్నాం' అని చెప్పారు.