Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా వారణాసిలో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ, 'రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో ఒక షెడ్యూల్ను, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు సన్నివేశాలను చిత్రీకరించాం. ఇటీవల పొల్లాచిలో కొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేశాం. అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాల కోసం ప్రస్తుతం వారణాసికి వెళ్ళాం. బుధవారం నుంచి కాశీలో యాక్షన్ ఎపిసోడ్స్ను షూట్ చేస్తున్నాం. పీటర్ హెయిన్స్ సారథ్యంలో కాశీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో ఈ యాక్షన్ బ్లాక్ను ప్లాన్ చేశాం. బలమైన కథ, కథనాలతో టెక్నికల్గా హై స్డాండర్డ్స్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. దర్శకుడు శ్రీవాస్ చాలా సమయం వెచ్చించి ఈ స్క్రిప్ట్ను డిజైన్ చేశారు. తెలుగులో ఇది చాలా డిఫరెంట్ చిత్రంగా నిలిచిపోతుంది. ఇప్పటి వరకు దాదాపు 50శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఆడియెన్స్కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం చిత్రబృందమంతా కష్టపడి పనిచేస్తోంది' అని అన్నారు. జగపతిబాబు, శరత్కుమార్, మీనా, వెన్నెల కిషోర్, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్.