Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుదేవా హీరోగా, తమన్నా కథానాయికగా, సోనూ సూద్ ప్రధాన పాత్రల్లో గతేడాది రూపొందిన 'దేవి' చిత్రం మంచి విజయం సాధించింది. తెలుగులో 'అభినేత్రి'గా విడుదలై ఫర్వాలేదనిపించుకుంది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు విజరు, హీరో ప్రభుదేవా. 'దేవి' చిత్రం ఎండింగ్లో పార్ట్ 2కు క్లూ ఇచ్చారు. ఇప్పుడు ఆ సీక్వెల్ను తెరకెక్కించాలని భావిస్తున్నారట. దర్శకుడు విజరు ప్రస్తుతం సాయిపల్లవి ప్రధాన పాత్రలో 'కరు' అనే సినిమాను రూపొందిస్తున్నారు. ప్రభుదేవా 'యంగ్ మంగ్ చంగ్', 'గులేబాకావాలి', కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 'మెర్కూరి' చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. అలాగే తన దర్శకత్వంలో విశాల్, కార్తీ కాంబినేషన్లో మల్టీస్టారర్ 'కరుప్పురాజా వెళైరాజా' సినిమాను తెరకెక్కించాలని భావించారు. కానీ ఆ చిత్రం వాయిదా పడినట్టు తెలుస్తుంది. దీంతో ప్రభుదేవా 'దేవి 2'పై దృష్టిసారించారట. ఈ చిత్రానికి సంబంధించి విజరు, ప్రభుదేవాల మధ్య ఇటీవల కథా చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. విజరు రూపొందిస్తున్న తాజా చిత్రం, ప్రభుదేవా నటిస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది. మరి ఈ చిత్రంలో దేవి పాత్ర కోసం 'దేవి'లో నటించి తమన్నానే తీసుకుంటారా? కొత్త నాయికతో వెళ్తారా ? అన్నది మున్ముందు తేలనుంది.