Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా యువి క్రియేషన్స్ సమర్పణలో, పాకెట్ సినిమా పతాకంపై 'హ్యాపీ వెడ్డింగ్' అనే సినిమా తెరకెక్కబోతోంది. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతుండటం విశేషం.
ఆ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ, 'మా బ్యానర్లో సుమంత్ అశ్విన్ తొలిసారిగా నటిస్తున్న చిత్రమిది. అలాగే సుమంత్ అశ్విన్, నిహారికలది కూడా తొలి కాంబినేషనే కావడం మరో విశేషం.
ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సమకూరుస్తున్న బాణీలు సినిమాకు హైలైట్గా నిలవనున్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ను అక్టోబర్ 4 నుంచి ప్రారంభించనున్నాం' అని అన్నారు.