Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన 'ఆక్సిజన్' చిత్రం గోపీచంద్ కెరీర్లోనే స్పెషల్ సినిమా అవుతుంది' అని అంటున్నారు నిర్మాత ఎస్.ఐశ్యర్య. గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయెల్ హీరో, హీరోయిన్లుగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం 'ఆక్సిజన్'. విడుదలకు సిద్దమైన ఈ చిత్రం గురించి నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ, 'యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. గోపీచంద్ డెడికేషన్, సపోర్ట్తో సినిమాను చక్కగా పూర్తి చేయగలిగాం. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై తదితర ప్రాంతాల్లో మేకింగ్లో రాజీపడకుండా చిత్రీకరించాం. జగపతిబాబు సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఆయన నటన సినిమాకు ప్లస్ అవుతుంది. సీజీ వర్క్ అద్భుతంగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ కాపీ సిద్ధమైంది. యువన్ శంకర్రాజా సంగీత సారథ్యంలో రూపొందిన పాటలను అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేసి, సినిమాను అక్టోబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. 'కిక్'శ్యామ్, చంద్రమోహన్, అలీ, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, ప్రభాకర్, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సితార తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెట్రి, ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్.