Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకే చోట పుట్టి పెరిగి, ఒకే చోట చదువుకున్న వ్యక్తులు చాలా రోజుల తర్వాత వృత్తిపరమైన రంగంలో కలిస్తే ఆ టైమ్లో పొందే ఆనందాన్ని, అనుభూతిని మాటల్లో వర్ణించలేం. అదొక బిగ్ సర్ప్రైజ్గా లైఫ్లాంగ్ గుర్తుండి పోతుంది. సరిగ్గా ఇలాంటి బిగ్ సర్ప్రైజ్తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆనందానికి ఆకాశమే హద్దయ్యింది. అసలు విషయంలోకి వస్తే, రకుల్ ప్రస్తుతం నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న గూఢాచారి నేపథ్య చిత్రం 'అయ్యారి'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్.. వీళ్లిద్దరి ప్రయాణం ఒకే చోట నుంచి ప్రారంభమైందనే విషయం తెలిసి రకుల్ షాకైంది. ఆ స్వీట్ సర్ప్రైజ్ షాక్ గురించి రకుల్ అభిమానులతో పంచుకుంటూ, 'మా ఇద్దరి ఇండ్లు ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఉండేవి. మా ఇంటి వెనకాలే సిద్ధార్థ్ ఇల్లు ఉండేది. ఢిల్లీ యూనివర్సిటీలోనే మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఇద్దరం ఒకే జిమ్కు వెళ్లేవాళ్ళం. మా ట్రైనర్ కూడా ఒకరే. కానీ ఎప్పుడూ కలుసుకోలేదు. ఈ విషయాలన్ని 'అయ్యారి' చిత్ర షూటింగ్లో సిద్ధార్థ్తో మాట్లాడుతుంటే తెలిశాయి. బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన ఈ విషయాలన్ని షూటింగ్లో మేమిద్దం బాగా నటించేందుకు ఉపయోగపడుతున్నాయి' అని తెలిపింది. రకుల్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 'స్పైడర్', కార్తీ సరసన 'ధీరన్ అదిగారమ్ ఒండ్రు' (తెలుగులో ఖాకి) చిత్రాల్లో నటిస్తోంది. మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'స్పైడర్' చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.