Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'రోబో'కి సీక్వెల్గా రూపొందుతున్న చిత్రం '2.0'. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అక్షరు కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ కథానాయిక. చిత్ర ప్రమోషన్లో భాగంగా శనివారం హైదరాబాద్లోని ఐమాక్స్లోని బిగ్ స్క్రీన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ప్రముఖ నిర్మాత డి.సురేష్బాబు మాట్లాడుతూ, 'మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చిత్ర పరిశ్రమ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. సినిమా కథకు సాంకేతికత జోడిస్తే అది అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతారు. సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్యని పెంచాలంటే ఎప్పటికప్పుడు కొత్తకొత్త అంశాలను ప్రేక్షకులకు పరిచయం చేయాలి. సాంకేతికత వల్ల వచ్చే అనుభూతిని వారికి అందేలా చేస్తే సినిమా చూసేందుకు మక్కువ చూపిస్తారు. లేదంటే ప్రేక్షకుల సంఖ్య మరింత తగ్గిపోతుంది. భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వాల్యూస్తో హాలీవుడ్ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ '2.0' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. 'ఇండియాలో బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా, 'రోబో'కి సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సినిమాను 2డీలోనే కాకుండా 3డీలో కూడా రూపొందిస్తున్నాం. దీంతో మల్టీప్లెక్సుల్లోనే కాకుండా సాధారణ థియేటర్లలో కూడా ప్రేక్షకులు చూడొచ్చు. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాం.
విజువల్ ట్రీట్గా నిలిచే ఈ చిత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో సినిమాను విడుదల చేయబోతున్నాం. ఇండియాలోనే కాకుండా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయాలని భావించాం. చైనాలో పదిహేను నుంచి పదహారు వేల థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని లైకా ప్రొడక్షన్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం తెలిపారు.
ఈ కార్యక్రమంలో శరత్ మరార్, భరత్, సత్యం, ప్రీతమ్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.