Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్టర్ రోహిత్చంద్ర, నితిన్ చంద్ర, బేబీ ప్రణీత, బేబీ శ్రియ ముఖ్య పాత్రధారులుగా కలసాధన కృష్ణ దర్శకత్వంలో కలసాధన ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'నేనే మైఖేల్'. బిహారి బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ మంగళవారం ఫిల్మ్ఛాంబర్లో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ బిసి కమీషన్ చైర్మెన్ బి.ఎస్.రాములు పాటల సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'550 మంది పిల్లలతో దర్శకుడు కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించడం గొప్ప విషయం. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తే గొప్ప గొప్ప కళాకారులు తయారవుతారు. ఈచిత్రంలోని పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా రోహిత్ అద్భుతంగా డాన్స్ చేశాడు.
చిన్న సినిమాగా రూపొందిన ఈచిత్రం పెద్ద సినిమాగా విజయం సాధించాలి. క్రమశిక్షణతో జీవితంలో గొప్ప లక్ష్యాలను నిర్ణయించుకుని, వాటిని సాధించే దిశగా ప్రయత్నాలు చేయాలని ఈ చిత్రంలో అత్యద్భుతంగా చూపించారు' అని అన్నారు. 'చిన్నప్పట్నుంచి డాన్స్ను ప్రాణంగా భావించే ఓ కుర్రాడు ఎలా మైఖేల్ జాక్సన్గా మారాడు అనే కథాంశంతో ఈచిత్రాన్ని తెరకెక్కించాం. షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం' అని దర్శకుడు చెప్పారు.