Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చంద్రకాంత్, రాధిక, పల్లవిడోరా హీరో, హీరోయిన్లుగా థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై గోవర్థన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం'. ఈచిత్ర ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ,'టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం కలుగుతోంది. అంతా అమెరికాలోనే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో నటించినవారు, పని చేసిన వారు సైతం అమెరికాలో నివసిస్తున్న మన తెలుగువారే కావడం అభినందించదగ్గ విషయం. ఈనెల 17న రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలోనూ విడుదలవుతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి దర్శక, నిర్మాత గోవర్థన్కు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను' అని చెప్పారు. 'నవ్య కథతో ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి రూపొందించిన ఈచిత్రం కచ్చితంగా విశేష ప్రేక్షకాదరణ పొందుతుందని ఆశిస్తున్నాం' అని దర్శక, నిర్మాత గోవర్థన్ అన్నారు. 'ప్రేమకథా చిత్రాల్లోనే ఇదొక డిఫరెంట్ సినిమా. ఇటువంటి సినిమాలో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది' అని నాయకానాయికలు తెలిపారు.