Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బిచ్చగాడు'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజరు ఆంటోని హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఇంద్రసేన'. డయానా చంపిక, మహిమ కథానాయికలుగా జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ రైట్స్ను ఎన్.కె.ఆర్ ఫిల్మ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. ఆ విశేషాలను నీలం కృష్ణారెడ్డి తెలియజేస్తూ, 'టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. 'బిచ్చగాడు' కంటే బిగ్గెస్ట్ హిట్ అవ్వగల స్థాయి కంటెంట్ ఉన్న సినిమా ఇది.
ఆ నమ్మకంతోనే భారీ పోటీ ఉన్నప్పటికీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సినిమాను విడుదల చేసే హక్కులను సొంతం చేసుకున్నాం.
ఈ నెల 16న హైదరాబాద్లో భారీ స్థాయిలో ఆడియో వేడుకను నిర్వహిస్తాం. అదే వేడుకలో సినిమాలో ఓ పది నిమిషాల నిడివి గల ఫుటేజ్ను ప్లే చేస్తాం. అలాగే ఓ ఫుల్ వీడియో సాంగ్ను కూడా ప్రదర్శిస్తాం. ఆ వీడియో సాంగ్ను మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేస్తారు. మా సంస్థ నుంచి విడుదలైన మునుపటి చిత్రాలు 'ఇంకొక్కడు', 'జయమ్ము నిశ్చయమ్మురా' తరహాలోనే ఈ సినిమా కూడా ఘన విజయం సొంతం చేసుకుని హ్యాట్రిక్ హిట్ అందుకుంటామన్న నమ్మకం ఉంది' అని అన్నారు.