Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అరుంధతి', 'రుద్రమదేవి', 'బాహుబలి' వంటి భారీ చిత్రాల తర్వాత అనుష్క మహిళా ప్రధాన పాత్రధారిణిగా రూపొందుతున్న 'భాగమతి' చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయబోతున్నారు. ఆ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ, ''బాహుబలి' చిత్రంతో అనుష్క క్రేజ్ బాగా పెరిగింది. కెరీర్ పరంగానూ మంచి ఫాంలో ఉన్న అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మేం నిర్మిస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాం.
ఈ చిత్ర ఫస్ట్లుక్తో సినిమాపై అంచనాలు
భారీగా పెరిగాయి. ఈ లుక్కి వస్తోన్న స్పందన మాకు ఎనర్జీనిచ్చింది. కథ అద్భుతంగా కుదిరింది. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు అశోక్ సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అనుష్క నటన సినిమాకు హైలైట్గా నిలుస్తుంది.
మధి కెమెరా వర్క్ ప్రత్యేక ఆకర్షణ. ఆర్ట్ రవీందర్ వేసిన సెట్స్ గ్రాండియర్గా ఉంటాయి.
కథకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్తో నిర్మించాం. తమన్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని హైలైట్ చేసేదిగా ఉంటుంది. ఆద్యంతం వినోదాన్ని పంచే ఈ చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది' అని అన్నారు.
ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజరు, అజరు ఘోష్, మధునందన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.