Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2014, 2015, 2016.. ఈ మూడు సంవత్సరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అవార్డులు దక్కని ప్రముఖులు ప్రెస్మీట్లు పెట్టి అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందని ఆవేదన, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, అ అవార్డుల కమిటీ చెర్మైన్ బాలకృష్ణ మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన నటించిన 'లెజెండ్' చిత్రానికి 9 అవార్డులు రావడం పట్ల చాలా గర్వంగా ఉందని హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో చెప్పారు. అందరి సమష్టి కృషి వల్లే ఇన్ని అవార్డులు సాధ్యమయ్యాయన్నారు. తోటి కళాకారులకు, ఇతర చిత్రాలకు అవార్డులు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. అవార్డులపై వస్తున్న విమర్శలకు మీ సమాధానమేమిటి అని ప్రశ్నకు చిరునవ్వుతో సమాధానాన్ని దాటవేశారు.
మహిళా సాధికారతను తెలిపే చిత్రం
''రుద్రమదేవి'కి నంది అవార్డులు దక్కకపోవడంపై నేను మాట్లాడినందుకు నా వెనుక ఏదో శక్తులున్నాయని కొందరంటున్నారు. కానీ నా వెనుక ఎలాంటి శక్తులు లేవు' అని అంటున్నారు దర్శకుడు గుణశేఖర్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'నా సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని సినిమా విడుదలకు ముందు రోజే అటు తెలంగాణ, ఇటు ఆంధ్రా ప్రభుత్వాలకు దరఖాస్తు సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. పన్ను మినహాయించాలని ఎంత వేడుకున్నా న్యాయం జరగలేదు. ఇప్పుడు నంది అవార్డుల విషయంలోనూ అన్యాయమే జరిగింది. నాకు అవార్డు రానందుకు బాధగా లేదు. మహిళా సాధికారతపై తీసిన సినిమాకు అవార్డు ఇవ్వకపోవడం బాధగా ఉంది. ఈ విషయంలో అడిగే హక్కు, అసంతృప్తిని వ్యక్తం చేసే హక్కు ఉంది.
జాతీయ అవార్డు విషయంలో నా సినిమాకు బదులు 'కంచె'కు ఇచ్చారు.
కులవ్యవస్థపై వచ్చిన ఆ సినిమాకు జాతీయ అవార్డు రావడం నేను సమర్థిస్తున్నా.
కానీ నంది అవార్డులు తెలుగు జాతికి సంబంధించినవి. 'రుద్రమదేవి' మరిచిపోతున్న తెలుగు చరిత్రను తెలిపింది. ఇందులో అసలు సందేశమే కనిపించలేదా?', అలాగే వర్మపై చేసిన వ్యాఖ్యలను మద్దినేని రమేష్ వెనక్కి తీసుకోవాలి' అని గుణశేఖర్ అన్నారు.