Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దీపికా పదుకొనె ప్రధాన పాత్రధారిణిగా సంజరు లీలా భన్సాలీ రూపొందిస్తున్న 'పద్మావతి' చిత్రాన్ని వివాదాలు చుట్టు ముట్టాయి. చరిత్రను వక్రీకరిస్తున్నారని, పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య వచ్చే సన్నివేశాలు తొలగించాలని, సినిమాను వాయిదా వేయాలని పలు హిందూత్వ సంస్థలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న విడుదల కావాల్సిన సినిమాను వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. 'చిత్తోర్గడ్ మహారాణి పద్మావతి కథ ఆధారంగా భన్సాలీ రూపొందించిన ఈ చిత్రానికి షూటింగ్ ప్రారంభం నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. విడుదల టైమ్లో కూడా పలు వివాదాలు తలెత్తడంతో ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయడం లేదు. చట్టం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)లను గౌరవిస్తున్నాం. సినిమా విడుదలకు కావాల్సిన అనుమతులు త్వరలోనే వస్తాయన్న నమ్మకం ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ను ప్రకటిస్తాం'
అని చిత్ర నిర్మాణ సంస్థ వయాకామ్ 18 అధికారిక ప్రతినిధి తెలిపారు.