Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి నటిస్తే అదొక క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. ఆ ఇద్దరు సూపర్ స్టార్లను ఓ స్టార్ డైరెక్టర్ డీల్ చేస్తే నిజంగానే అదొక సెన్సేషన్ ప్రాజెక్ట్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. త్వరలో అలాంటి ప్రాజెక్ట్ ఒకటి టాలీవుడ్లో సెట్ కాబోతుంది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ను తెరకెక్కించబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వార్తకు తగ్గట్టుగానే రామ్చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి సరదాగా దిగిన ఫొటో సాక్ష్యంగా నిలుస్తోంది.'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించబోయే చిత్రం ఈ ఇద్దరి హీరోలతో ఉంటుందని సమాచారం. దీంతో అటు ఎన్టీఆర్, ఇటు రామ్చరణ్ అభిమానులు ఇప్పట్నుంచే ఫెస్టివల్ స్టార్ట్ అయ్యిందనే సంతోషంలో ఉన్నారు. రాజమౌళి గతంలో రామ్ చరణ్తో 'మగధీర', ఎన్టీఆర్తో 'సింహాద్రి', 'యమదొంగ' చిత్రాలను తెరకెక్కించి అద్భుత విజయాలను సొంతం చేసుకున్న విషయం విదితమే.