Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'80వ దశక సౌత్ యాక్టర్స్ రీ యూనియన్' పేరుతో దక్షిణాది తారలంతా ఈ నెల 17న మహాబలిపురంలో 8వసారి కలుసుకున్నారు. వృత్తి, వ్యక్తిగత విషయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ గత ఏడేండ్లుగా పాటిస్తున్న సంప్రదాయన్ని కొనసాగించడం విశేషం. చిరంజీవి, వెంకటేష్, శరత్కుమార్, జాకీ షరాఫ్, భాగ్యరాజ్, రాజ్కుమార్, అర్జున్, నరేష్, భానుచందర్,
సుమన్, సురేష్, రెహ్మాన్, సుహాసిని, ఖుష్బు, రాధికా, అంబిక, రాధ, జయసుధ, పూనమ్ ధిల్లాన్, పూర్ణిమ భాగ్యరాజ్, రమ్యకృష్ణ, పార్వతి జయరామ్, సుమలత, లిస్సీ, రేవతి, మేనక, శోభన, నదియా ఇలా 28 నటీనటులు ఒకే రంగు దుస్తులు ధరించి ఈ గెట్ టు గెదర్ పార్టీలో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. ఈ గెట్ టు గెదర్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.